Gold Prices: భారీగా పెరిగిన పసిడి ధరలు.. కారణం ఇదే.! 16 d ago

8K News-09/04/2025 ఇవాళ (బుధవారం) బంగారం ధరలు బాగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹650, ₹710 పెరిగింది. ట్రంప్ విధించిన అధిక సుంకాల కారణంగా పెట్టుబడిదారులు బంగారంపై అధిక పెట్టుబడులు పెట్టారు..దీంతో ఒక్కసారిగా పసిడి ధరలు ఆకాశాన్ని తాకాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,900 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,440 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే వెయ్యి రూపాయలు తగ్గి.. కేజీ వెండి ధర రూ.1,02,000 వద్ద పలుకుతుంది.